Wednesday, August 6, 2025
Homeతెలంగాణహైదరాబాద్సోషల్ మీడియా పోస్ట్ లపై పోలీసుల డేగ కన్ను

సోషల్ మీడియా పోస్ట్ లపై పోలీసుల డేగ కన్ను

Date:

Related stories

పంచాయతీ ఎన్నికలకు తెలంగాణ సర్కారు కసరత్తు

పంచాయతీ ఎన్నికలకు తెలంగాణ సర్కారు కసరత్తు..  కులగణన పూర్తికాగానే జనవరిలో ఎన్నికలు సూర్య జ్యోతి...

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధ సాధన కోసం

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధ సాధన కోసం  - రేవంత్ రెడ్డి...

మూడు దేశాల పర్యటన ముగించుకొని స్వదేశానికిప్రధాని మోడీ.

మూడు దేశాల పర్యటన ముగించుకొని స్వదేశానికిప్రధాని మోడీ. సూర్య జ్యోతి స్టేట్ ఇంచార్జి...

బాలానగర్ డిసిపి పరిధిలో మెగా హెల్త్ క్యాంప్

బాలానగర్ డిసిపి పరిధిలో మెగా హెల్త్ క్యాంప్.... ప్రారంభించిన బాలనగర్ డిసిపి సురేష్...
spot_imgspot_img

సోషల్ మీడియా పోస్ట్ లపై పోలీసుల డేగ కన్ను
Police eagle eye on social media postsసూర్య జ్యోతి స్టేట్ ఇంచార్జి టి రాజగోపాల్
సూర్య జ్యోతి, నవంబర్ 22, హైదరాబాద్ : తెలంగాణ పోలీసులు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు చేసే వారికి హెచ్చరికలు జారీ చేసింది,అభ్యంతరకర పోస్టులు, విద్వేషపూరిత, వివాదాస్పద వ్యాఖ్యలపై తెలంగాణ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. సైబర్‌ ప్యాట్రోలింగ్‌’ ద్వారా సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై నిఘా ఉంచి బాధ్యులపై సుమోటోగా కేసులు నమోదు చేస్తు న్నారు. ప్రత్యేకంగా స్మాష్‌ విభాగాన్ని ప్రారంభించి అభ్యంతరకర పోస్టులు చేసినవారిని అరెస్ట్ చేసి జైలుకు పంపుతున్నారు.
ఓ పార్టీ నాయకుడు నచ్చలేదన్న కారణంతో అతడి వ్యక్తిత్వాన్ని కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు.. ప్రపంచంలో ఏదో ఒక మూల జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకుని ఓ వర్గాన్ని కించపరుస్తూ విద్వేషపూరిత పోస్టులు పెడుతుండటం ఇటీవల సాధారణమైంది.వాట్సాప్‌ గ్రూపులు, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్‌లలో అడ్డగోలుగా కామెంట్లు చేస్తున్నారు. దీనిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సైబర్ పెట్రోలింగ్ తో నిఘా సోషల్ మీడియాలో చేసే వివాదా స్పద పోస్టులు శాంతి భద్రతలతోపాటు సాధారణ ప్రజాజీవనంపైనా ఇవి తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో కఠిన చర్యలకు దిగుతున్నారు.
కేసులు పెట్టి కటకటాల వెనక్కి పంపిస్తున్నారు. కేవలం బాధితులు ఫిర్యాదు చేసినప్పుడే కాకుండా ‘సైబర్‌ ప్యాట్రోలింగ్‌’ ద్వారా సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై నిఘా ఉంచి బాధ్యులపై సుమోటోగా కేసులు నమోదు చేస్తున్నారు.
ఇలాంటి కామెంట్లు పెట్టి పోలీసులకు చిక్కుతున్న కేసుల్లో ఎక్కువగా విద్యార్థులు, సాధారణ ఉద్యోగులు, చిరు వ్యాపారులు ఉంటున్నారు. కేసులు నమోదయ్యాక బాధ్యుల్ని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి విచారించి నప్పుడు పొరపాటున, క్షణికావేశంలో చేశామంటూ తప్పించుకుంటున్నారు. సోషల్ మీడియాలో పోస్టు చేస్తే స్మాషే నెట్టింట తప్పుడు ప్రచారం, వర్గాల మధ్య విభేదాలు సృష్టిస్తున్న ఘటన హైదరాబాద్‌లోనే ఎక్కు వగా నమోదవుతున్నట్లు జాతీయ నేర గణాంక సంస్థ- 2022 వెల్లడించింది. 2022లో 94, 2023లో 25, ఈ ఏడాది 20 కేసులు నమోదు చేశామని పోలిసులు తెలిపారు.

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here