Monday, April 28, 2025
Homeతెలంగాణహైదరాబాద్10 ఎకరాలు లోపు ఉన్న వారికే రైతు భరోసా...

10 ఎకరాలు లోపు ఉన్న వారికే రైతు భరోసా…

Date:

Related stories

పంచాయతీ ఎన్నికలకు తెలంగాణ సర్కారు కసరత్తు

పంచాయతీ ఎన్నికలకు తెలంగాణ సర్కారు కసరత్తు..  కులగణన పూర్తికాగానే జనవరిలో ఎన్నికలు సూర్య జ్యోతి...

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధ సాధన కోసం

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధ సాధన కోసం  - రేవంత్ రెడ్డి...

మూడు దేశాల పర్యటన ముగించుకొని స్వదేశానికిప్రధాని మోడీ.

మూడు దేశాల పర్యటన ముగించుకొని స్వదేశానికిప్రధాని మోడీ. సూర్య జ్యోతి స్టేట్ ఇంచార్జి...

సోషల్ మీడియా పోస్ట్ లపై పోలీసుల డేగ కన్ను

సోషల్ మీడియా పోస్ట్ లపై పోలీసుల డేగ కన్ను సూర్య జ్యోతి స్టేట్...

బాలానగర్ డిసిపి పరిధిలో మెగా హెల్త్ క్యాంప్

బాలానగర్ డిసిపి పరిధిలో మెగా హెల్త్ క్యాంప్.... ప్రారంభించిన బాలనగర్ డిసిపి సురేష్...
spot_imgspot_img

10 ఎకరాలు లోపు ఉన్న వారికే రైతు భరోసా…

– మార్గదర్శకాలు సిద్ధం- అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్న తెలంగాణ సర్కార్…..

సూర్య జ్యోతి స్టేట్ ఇంచార్జి టి రాజగోపాల్

సూర్య జ్యోతి, నవంబర్ 6, హైదరాబాద్ : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసాపై దృష్టి సారించింది.పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలకు తీపి కబురు చెప్పింది. రైతు భరోసాకు పదెకరాల వరకు కటాఫ్ విధించాలని నిర్ణయించింది. ఈమేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం నివేదికను సమర్పించినట్టు తెలిసింది. నివేదికలోని కీలకమైన మార్గదర్శకాలపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. గత బీఆర్ఎస్ సర్కారు ఐదేండ్లలో రైతు బంధు పేరిట దాదాపు రూ.20వేల కోట్లను వ్యవసాయేతర భూములకు ఇచ్చి ప్రజా సొమ్మును వృధా చేసిందని పెట్టుబడి సాయంలో 96శాతం రైతులకు మేలు చేసేందుకు సర్కారు సిద్ధమవుతున్నదని సీఎం రేవంత్రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు గత సర్కార్ హయాంలో రాళ్లు, రప్పల భూములు, గుట్టలు, హైవేలు, రోడ్లు, వెంచర్లు, భూసేకరణ కింద పోయిన భూములకు వేల కోట్ల రూపాయలు రైతుభరోసా కింద వథాగా చెల్లించినట్లు తేల్చింది.
వానాకాలం నుంచా? యాసంగి నుంచా?
రైతులకు పంట పెట్టుబడి సాయం ఈ నెలాఖరు నుంచి పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. కానీ దాన్ని వానాకాలం నుంచి లెక్కగట్టి ఇస్తారా? లేక ఈ యాసంగి నుంచి రైతు భరోసా జమ చేస్తారా? అనే విషయంలో స్పష్టత లేదు. అయితే రైతు భరోసాకు నిధులను సర్దుబాటు చేయాలంటూ ఆర్థిక శాఖను సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే ఆదేశించినట్టు సమాచారం.ఎప్పటి మాదిరిగానే ఒక ఎకరా నుంచి మొదలుపెట్టాలనీ, డిసెంబర్ నెలాఖరు వరకైనా సరే రైతుల ఖాతాలకు నిధుల జమ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. వాస్తవానికి దసరా తర్వాత నుంచే రైతు భరోసా పంపిణీ చేయాలని తొలుత ప్రభుత్వం భావించింది. కానీ, అప్పటికే రుణమాఫీ కోసం రూ.18 వేల కోట్లు రైతులకు విడుదల చేసింది. దీంతోపాటు మరికొన్ని స్కీములకు నిధులు సర్దుబాటు చేయాల్సి వచ్చిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీంతో రైతు భరోసా వాయిదా పడుతూ వస్తున్నది. అయితే డిసెంబర్ నెలలో జరగనున్న స్థానిక ఎన్నికల కంటే ముందే రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయనున్నట్టు సమాచారం. ప్రతి 10 రోజులకు రూ.1,500 కోట్ల నుంచి రూ. 2 వేల కోట్ల చొప్పున జమ చేసేలా 45 రోజుల్లో కనీసం రూ.7 వేల కోట్లు జమ చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. రాష్ట్ర వ్యవసాయ శాఖ సాగు లెక్కల ప్రకారం 1.39 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈ నేపథ్యంలో రైతు భరోసాలో దుబారాను కట్టడి చేసినా పెట్టుబడి సాయం కోసం దాదాపు రూ. 7వేల కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. విస్తృత అభిప్రాయ సేకరణ పూర్తి ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఏడెనిమిది ఎకరాల రైతులకు అంటే దాదాపు 96 శాతం మందికి రైతుభరోసా అందుతుంది. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి, ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలనే దానిపై జిల్లాల్లో సభలు నిర్వహించి అభిప్రాయ సేకరణ పూర్తి చేసింది. చాలా మంది రైతులు 10 ఎకరాల వరకు పెట్టుబడి సాయం ఇస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. మరికొంతమంది రైతులు ఏడున్నర ఎకరాల వరకు ఇవ్వాలని సూచించారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే కటాఫ్ ఎంతవరకు పెట్టాలనే దానిపై మార్గదర్శకాలకు సంబంధించిన ముసాయిదాను సిద్ధం చేసినట్టు సమాచారం. రైతులు, రైతు సంఘాలు, వివిధ పార్టీల అభిప్రాయాలు ఇప్పటికే తెలుసుకున్నందున, అవసరమైతేనే అసెంబ్లీలో చర్చించాలని ప్రభుత్వం భావిస్తున్నది. అసెంబ్లీ సమావేశాలను కూడా ఈ నెల మొదటి వారంలో నిర్వహించాలని అనుకున్నప్పటికీ శాసనమండలి చైర్మెన్, అసెంబ్లీ స్పీకర్ విదేశీ పర్యటనలో ఉండటంతో వారు తిరిగిరాగానే ఆ సమావేశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశాల్లో రైతు భరోసా మార్గదర్శకాలపై చర్చించే అవకాశం ఉంది. మొత్తానికి వ్యవసాయేతర భూములకు ఎట్టిపరిస్థితుల్లోనూ రైతుభరోసా ఇవ్వొద్దని ప్రభుత్వం గట్టిగా నిర్ణయించినట్టు వినికిడి. వ్యవసాయ భూముల్లో వెంచర్లు చేసి ప్లాట్లుగా మార్చిన వాటికి నాలా కిందనే పరిగణించనున్నారు. రోడ్లు, ఇరిగేషన్, ఇండ్లు ఇతరత్రా వ్యవసాయేతర భూములకు మళ్లిన వాటిని రైతు భరోసా జాబితా నుంచి తీసేయాలని నిర్ణయించారు. దీంతో చాలా వరకు నిధుల దుర్వినియోగం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తున్నది.

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here