Wednesday, August 6, 2025
Homeతెలంగాణహైదరాబాద్పంచాయతీ ఎన్నికలకు తెలంగాణ సర్కారు కసరత్తు

పంచాయతీ ఎన్నికలకు తెలంగాణ సర్కారు కసరత్తు

Date:

Related stories

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధ సాధన కోసం

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధ సాధన కోసం  - రేవంత్ రెడ్డి...

మూడు దేశాల పర్యటన ముగించుకొని స్వదేశానికిప్రధాని మోడీ.

మూడు దేశాల పర్యటన ముగించుకొని స్వదేశానికిప్రధాని మోడీ. సూర్య జ్యోతి స్టేట్ ఇంచార్జి...

సోషల్ మీడియా పోస్ట్ లపై పోలీసుల డేగ కన్ను

సోషల్ మీడియా పోస్ట్ లపై పోలీసుల డేగ కన్ను సూర్య జ్యోతి స్టేట్...

బాలానగర్ డిసిపి పరిధిలో మెగా హెల్త్ క్యాంప్

బాలానగర్ డిసిపి పరిధిలో మెగా హెల్త్ క్యాంప్.... ప్రారంభించిన బాలనగర్ డిసిపి సురేష్...
spot_imgspot_img

పంచాయతీ ఎన్నికలకు తెలంగాణ సర్కారు కసరత్తు.. 
కులగణన పూర్తికాగానే జనవరిలో ఎన్నికలు
Telangana government is preparing for panchayat elections.సూర్య జ్యోతి స్టేట్ ఇంచార్జి టి రాజగోపాల్ 
సూర్యజ్యోతి, నవంబర్ 22 : తెలంగాణ రాష్ట్ర సర్కార్ పంచాయతీ ఎన్నికలను జనవరిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఆ లోపే ఆసరా పెంపు, రైతు భరోసా అమలు కులగణన ఆధారంగా రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో పాగా యే లక్ష్యంగా యాక్షన్ ప్లాన్ సంక్రాంతి తర్వాతే పోలింగ్ ఉండే అవకాశం ఉంది.పంచాయతీ ఎన్నికలను జనవరిలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆ లోపు ఆరు గ్యారెంటీల్లో భాగంగా హామీ ఇచ్చిన ఆసరా పింఛన్లను రూ. 4 వేలకు పెంచాలని భావిస్తోంది. అదే విధంగా రైతు భరోసాను కర్షకుల ఖాతాల్లో జమ చేయనుందని తెలుస్తోంది. ఈ నెల 6 నుంచి ప్రారంభమైన కులగణ ఈ నెల 30తో ముగియనుంది. ఆ రిపోర్ట్ ఆధారంగా స్థానిక ఎన్నికల రిజర్వేషన్లను ఖరారు చేసి స్థానిక ఎన్నికలను నిర్వహించనుంది. గ్రామాల్లో భూ వివాదాలకు కారణమైన ధరణి నిర్వహణ బాధ్యతను కూడా ప్రభుత్వం కేంద్ర సర్కారు సంస్థ ఎన్ ఐసీకి అప్పగించింది.
త్వరలో కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని అమలు చేయనుంది. ఈ మేరకు డిసెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లుకు అమోదం తెలుపనుంది. స్థానిక సంస్థల్లో పాగా వేసి రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదగాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల వరంగల్ లో జరిగిన సభలోనూ సీఎం రేవంత్ రెడ్డి ఇదే విషయాన్ని చెప్పారు. స్థానిక సంస్థల్లో పాగావేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు. డిసెంబర్ చివరి వారంలో షెడ్యూల్ విడుదలవుతుందనే చర్చ సాగుతోంది. అయితే జనవరి మొదటి వారంలో నోటిఫికేషన్ ఇచ్చి సంక్రాంతి తర్వాత ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారని తెలుస్తోంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం వరకు పోలింగ్ నిర్వహించి.. అదే రోజు రాత్రి కల్లా ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here